పోలీసులు అదుపులో తాజా మాజీ సర్పంచులు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ :పెండింగ్ బిల్లులు చెల్లించిన అనంతరమే సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీని ముట్టడించి ఆందోళన చేయాలని తద్వారా పెండింగ్ బిల్లులను సాధించాలని గతంలో పనిచేసిన సర్పంచి సంఘాలు పిలుపునిచ్చాయి.ఈ క్రమంలో శుక్రవా రం ఉదయం నుండే హుజురాబాద్ సబ్ డివిజన్లోని అన్ని గ్రామాల సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.ఈ సందర్భంగా పలువురు సర్పంచ్ లు మాట్లాడుతూ గత ప్రభుత్వం సర్పంచ్ లచే నిర్బంధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించి బిల్లులను మంజూరు చేయలేద న్నారు.ఇలా ప్రతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కు10 నుండి 20 లక్షల రూపాయల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచుల పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని సమీక్ష సమావేశాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశా రు.తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ప్రజాస్వా మ్యబద్దంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఉపక్రమి స్తే ఇలా అరెస్టు చేయడం శోచనీయమన్నారు.ఇప్పటికైనా తాజా మాజీ సర్పంచుల బాధలు అర్థం చేసుకొని ప్రభు త్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….