ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పుపైన హర్షం ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం

బాహుబలం న్యూస్ సైదాదాపూర్ ఆగస్టు 02:
సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి
ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు.30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటానికి ప్రతిఫలంగా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణను ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన మాదిగ మరియు ఉపకులాల ప్రజలకు రిజర్వేషన్లలో సమన్యాయం జరిగే విధంగా సుప్రీం కోర్టు తీర్పురావటం హర్షించదగినదని.దీనివల్ల షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న ఉపకులాల అందరికీ జనాభా దామాషా ప్రకారం సమాన అవకాశాలు దక్కుతాయని వివరించారు. బీసీలలో ఏ బి సి డి వర్గీకరణ ఏ విధంగానైతే ఉండి బీసీ లందరూ ఐకమత్యంతో కలిసి జీవిస్తున్నారో అదే విధంగా షెడ్యూల్డ్ కులాల ప్రజలందరూ రిజర్వేషన్ల వర్గీకరణను ఆమోదించి ఐకమత్యంతో తమ హక్కుల సాధన కోసం మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో రుద్రారపు రవితేజ ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు,పొడిశెట్టి వెంకట్రాజ్యం మాజీ ఎంపీపీ, డా:తడికమల్ల శేఖర్,మామిడ్ల రవీందర్,మోరె సతీశ్, రుద్రారపు రాజేంద్రప్రసాద్,పవన్, కార్తీక్,తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !