సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి జూలై 26:
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని కాలేశ్వరం లోని లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలేశ్వరం నుండి పంప్ హౌస్ వెంటనే ఆన్ చేసి మిడ్ మానేరుతో పాటు ఎల్ఎండి నింపినట్లయితే హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతులందరికీ పూర్తిస్థాయిలో నీళ్లు అందుతాయి అన్నారు.ఇప్పటికే నియోజకవర్గంలో చాలా వరకు రైతులు వేలే ఎకరాల్లో నాట్లు వేసి ఉన్నారన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు కోదాడ వరకు ఈ నీళ్లు అందు తాయి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యే లోపు పంప్ హౌస్ లు ఆన్ చేయకపోతే అసెంబ్లీ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులంద రినీ తీసుకువచ్చి పంప్ హౌస్ ఆన్ చేసి మిడ్ మానేరు, ఎల్ఎండి నింపుతామని హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ మీద ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తుందో మేడిగడ్డను చూస్తే అర్థమవుతుందన్నారు. మేడిగడ్డ మీదు గా పది లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నా యని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని, రాజకీయ తమాషాలు చేయకుండా వెంటనే ఆ నీటిని లిఫ్ట్ చేసి రైతులకు వ్యవసాయానికి అందించాలని డిమాండ్ చేశారు.











