ప్రజా ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధికి నోచుకోదా ??? విద్యారంగానికి మరియు వైద్య రంగానికి తీవ్ర అన్యాయం? బడ్జెట్ లో కేటాయించిన నిధులు జీతాలకే సరిపోతుంది. వెంటనే బడ్జెట్ ని సవరించి విద్యా వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్యకిరణ్.

సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్
:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని మరియు వైద్య రంగాన్ని విస్మరించిందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు లక్షల 9 వేల159 కోట్ల తో బడ్జెట్ ప్రవేశపెట్టగా విద్యారంగానికి కేవలం 21292 కోట్లు కేటాయించడం అంటే బడ్జెట్ మొత్తంలో కేవలం 7.3% నిధులు కేటాయించడం తీవ్ర నిరాశకు గురిచేసి 15% నిజవులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని కానీ బడ్జెట్ కేబుల్ లో హామీ మేరకు ఆయన నిధులు కేటాయించకపో వడం దారుణం అన్నారు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటు న్న కాంగ్రెస్ సర్కార్ వైద్య రంగానికి కేవలం 11 వేల 468 కోట్లు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీ 500 కోట్లు కేటాయించాల్సింది పోయి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు 500 కోట్లు కేటాయి స్తే ఏ మేరకు సరిపోతాయని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల మరియు మెస్ చార్జీల పెంపుపై ప్రకటనలేదని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు లాప్టాప్ లు విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వడం పై ప్రస్తావనలేదని ఈ బడ్జెట్ను వెంటనే సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయిం చాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వాల మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు తక్కువ నిధులు కేటాయించి తీవ్ర అన్యాయం చేసిందని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన 7వేల కోట్ల రూపాయల ఫీజు రియం బర్స్మెంట్ ఈ ప్రభుత్వ హయాంలో తీరుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులలో ఫీజు రియంబర్స్మెంట్ హూసే లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో బడ్జెట్ ను సవరించి అధిక నిధుల కేటాయించాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !