సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని, బిజెపి, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంపీలు 16 మంది కనీసం 16కు పైసలు కూడా తెలంగాణకు తీసుకురాకపోవడం సిగ్గుచేటని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు.కేంద్ర బడ్జెట్ సందర్భంగా గురువారం బండ శ్రీనివాస్ తన కార్యాలయంలో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టారని అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి భయపడకుండా తెలంగాణకు రావలసిన నీధులన్నిటిని వచ్చేదాకా పోరాటం చేశారని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ఎంపీలు తెలంగాణకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయింపు చేయించకపోవడంపై ప్రజలు తీవ్ర అసహ నాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు.ఇక పై తెలంగాణలో ఎంపీలు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారో చెప్పాలన్నా రు.పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ అయినప్ప టికీ ముఖ్య మంత్రితో కలిసి ఎంపీలంతా ఏకమై తమ రాష్ట్రానికి 15 వేల కోట్లు నిధులు తెచ్చుకున్నారని,అలాగే నిధులు రాని పంజాబ్ ఎంపీలు సైతం పార్లమెంట్లో తమ నిరసన వ్యక్తం చేశారని అన్నారు.తెలంగాణకు ఇంత అన్యాయం జరిగినా 16 మంది ఎంపీలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇప్పుడు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు నరేంద్ర మోడీని బడే బాయ్ అని చెప్పుకొచ్చారని అన్నారు. ప్రధానమంత్రి ని అంతలా పొగిడిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయింపు పై ఎందుకు నిలదీయ డం లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యా యాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర ధర్నా చేపట్టాల ని ఆ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు తెలు పుతుందని అన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని అన్నారు.తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్థమైందని తెలంగాణ గురించి పోరాడేది ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గుర్తించారన్నారు.ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామంటూ చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లక్షలు రుణమాఫీ మాత్రమే చేసిందని,అదికూడా పూర్తిస్థాయిలో చేయలేదని,చాలామంది రుణమాఫీ కాకపోవడంతో బ్యాం కర్ల చుట్టూ రోజు తిరుగుతున్నారని అన్నారు.వివిధ కార ణాలు చూపి రైతు రుణమాఫీ ఆగిపోయిందని అధికారు లు చెబుతు న్నారని అన్నారు.రైతులు రుణమాఫీపై అధి కారులను నిలదీస్తే తమకు పూర్తిస్థాయిలో గైడ్లైన్స్ రాలే దంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బడ్జెట్ తో పాటు ఆరు గారెంటీ లపై స్పందించి పూర్తిస్థాయిలో ప్రజల కు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.










