లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ రైడ్… దెబ్బకు ఎస్ఐ పరుగో ..పరుగు..

బాహుబలం ప్రతినిధి కరీంనగర్.జూన్22.
ఏసీబీ అధికారులకు చివరి క్షణంలో చిక్కకుండా తప్పించుకు న్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది,ఇసుక ట్రాక్టర్ల యజమానులను వేధిస్తున్న ఓ పోలీస్ అధికారిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వలపన్నారు.అయితే ఇలా చిక్కినట్లే చిక్కి సదరు ఎస్ఐ జారుకున్నాడు. బాధితుల నుండి డబ్బులు తీసుకునేక్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకోవాలని వ్యూహం రచించారు.అయితే వారిని గమనించిన ఎస్ఐ తప్పించుకుని పరుగులు పెట్టాడు.కరీంనగర్ జిల్లాలోని రాయికల్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఇసుక ట్రాక్టర్ల రవాణా విషయంలో చోటు చేసుకున్న లావాదేవీల్లో అక్కడి ఎస్ఐకి రూ.25 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.అయితే డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరిగింది.దీంతో తరుచూవేధిస్తున్న సదరు ఎస్ఐపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే మధ్యవర్తి ద్వారా ఈ డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయం జరగగా,డబ్బు లు తీసుకుంటున్న క్రమంలో ఎస్ఐని రెడ్ హ్యండెడ్‌ గా పట్టివ్వాలని అధికారులు నిర్ణయించారు.ఈ మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో శుక్రవారం రాత్రి 11 గంటల నుండి 12 గంటల ప్రాంతంలో బాధితులు,ఏసీబీ అధికారులు స్టేషన్ కు చేరుకున్నారు.అయితే ఎస్‌ఐని పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా,ఆయన స్టేషన్ కు చేరుకున్న తరువాత ఏసీబీ అధికారులను గమనించిన ఎస్ఐ వెంటనే వెనక్కి తిరిగి పరుగులు తీశాడు.దీంతో అతన్ని పట్టుకోలేక పోయిన ఏసీబీ అధికారులు మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు.పరారీలో ఉన్న ఎస్ఐ ఆచూకి కోసం ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు.కాగా,ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..