సమాన విద్య, వైద్యం కోసం పోరాడుదాం. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్. రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్

(బాహుబలం ప్రతినిధి వెంకటస్వామి సబ్బని)
హన్మకొండ జూన్ 22,:కాకతీయ యూనివర్సిటీ : శని వారం రోజున కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో గల జాఫర్ నిజాం సెమినార్ హాల్లో డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ నూతన విద్యార్థి సంఘము ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా డిఎస్ఎ రాష్ట్ర కన్వినర్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో డిఎస్ఎ సంఘం ఏర్పాటు,సంఘ లక్ష్యలు,ఆశయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించికున్న అనంతరం రాష్ట్ర కన్వీ నర్ కమిటీనీ ప్రకటించుకోవడం జరిగింది.డిఎస్ఎ రాష్ట్ర కన్వీ నర్ గా కామగోని శ్రావణ్ (మహబూబాబాద్)రాష్ట్ర కో కన్వీ నర్లుగా జిగర అనిల్ (వరంగల్ ),మున్నా గణేష్ (సూర్యాపే ట),ఉప్పుల శివ(హన్మకొండ)గుండాల రమేష్(ఆదిలాబాద్) లను రాష్ట్ర కో-కన్వీనర్ కమిటీగా ప్రకటించుకోవడం జరిగింది ఈ సందర్భంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్ మాట్లాడుతూ ఏడు దశబ్దాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించలేని దౌర్బాగ్యమైన స్థితిలో దేశపాలకులు న్నారని దీనికి వ్యతిరేకంగాపోరాడాల్సిన అవసరం విద్యార్థులు గా మనందరిపై ఉందనివారన్నారు.అలాగే రోజురోజుకు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలలకు వ్యతిరేకంగా పోరాడి,ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన అ వసరం ఉందని,జనాభా ధమాషా ప్రకారం రాజకీయ,ఆర్థిక, ఉద్యోగరంగాలలో రిజర్వేషన్ల అమలుకే డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పోరాడుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమలో డిఎస్ఎ రాష్ట్రనాయకులు పవన్,శివ నాగరాజు,అనిల్, శరత్,అభిషేక్, రవికుమార్ తదితరులు పాల్గోన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !