(సబ్బని వెంకటస్వామి బాహుబలంప్రతినిధి,)
హుజురాబాద్: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు గురువారం స్కూల్ యూనిఫాంలు పంపిణి చేశారు. కాట్రపల్లి గ్రామ ఎంసిటిసి సభ్యులు రావుల అనిత వెంకట్ లు విద్యార్థులకు స్కూల్ యూనిపామ్స్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల ప్రారంభం రోజుననే పాఠశాలలోని విదార్థులందరికి ఉచి తంగా పాఠ్యపుస్తకాలను,స్కూల్ యూనిఫాంలు అందజే స్తుందని పేర్కోన్నారు.అదేవిధంగా గ్రామస్థులు, ఉపాద్యా యులు పాఠశాలలో అత్యధిక మంది విద్యార్థులు వేరే విధంగా కృషిచేస్తూ పాఠశాల అభివృద్ధికి పాటు పడాల న్నారు. అదేవిధంగా పాఠశాలలోని సమస్యలను అధికారు ల దృష్టికి తీసుకు వెళ్ళి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాట్రపల్లి ఎంపిటీసీ రావుల అఖిత –వెంకట్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యా యులు ప్రవీణ్ కుమార్,ఉపాధ్యా యులు కుమార్,బిక్షపతి ,నర్సింహచారి,అనిల్,రమేష్, మమత, భవానీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.










