సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు..

బాహుబలంప్రతినిథి హన్మకొండ
న్యూస్ జూన్ 10..
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్,లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్,సామాజిక వేత్త సాగంటి మంజులకి మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, సగౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు.వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డు ని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎం.పి.వేణుగోపాల చారీ అధ్యక్షత వహించారు.పలు రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ గుర్తించి అవార్డులను ప్రధానం చేసింది.ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఏ రంగం లో ఐన అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా హనుమకొండ,వరంగల్ చిత్రకారులు ఆమెని అభినందించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !