బాహుబలంప్రతినిథి హన్మకొండ
న్యూస్ జూన్ 10..
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్,లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్,సామాజిక వేత్త సాగంటి మంజులకి మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, సగౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు.వివిధ రంగాలలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డు ని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎం.పి.వేణుగోపాల చారీ అధ్యక్షత వహించారు.పలు రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ గుర్తించి అవార్డులను ప్రధానం చేసింది.ఈ సందర్బంగా మంజుల మాట్లాడుతూ ఏ రంగం లో ఐన అవకాశాలను అంది పుచ్చుకుని ముందుకు వెళ్లడమే లక్ష్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా హనుమకొండ,వరంగల్ చిత్రకారులు ఆమెని అభినందించారు..










