కాంగ్రెస్ లోచేరిన 19వ వార్డు కౌన్సిలర్ రాజు సతీమణి.

బాహుబలం న్యూస్ మే 09 హుజురాబాద్.
అనారోగ్యంతో చనిపోయిన హుజురాబాద్ మున్సిపాలిటీలోని 19వ వార్డ్ కౌన్సిలర్ గోస్కుల రాజు సతీమణి లక్ష్మి, బీఆర్ఎస్ 19వ వార్డు యూత్ అధ్యక్షుడు గోస్కుల రాజ్ కుమార్ సుమారు 50 మంది సభ్యులతో గురువారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ తన భర్త మరణానంతరం బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీ కండువ కప్పుకున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో 19 వ వార్డు యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !