తోటి స్నేహితుని కుటుంబానికి పూర్వ విద్యార్థులు భరోసా ..

బాహుబలం న్యూస్ సైదాపూర్ మే 5
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం
వెక్కెపల్లి సైదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి తండ్రి కందుకూరి సత్యనారాయణ అకాల మరణం పట్ల తోటి విద్యార్థి తండ్రి మరణ వార్త విషయం తెలుసుకొని పూర్వ విద్యార్థు లు ఆ కుటుంబానికి అండగా నిలిచి 50 కిలోల బియ్యంతో పాటు నూనె డబ్బాను ఆ కుటుంబానికి అందజేసి పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలబడేమే గాక ఒక స్వచ్ఛంద సంస్థ గాఏర్పాటు చేసి సంయుక్తంగా పలు ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకుని నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని సామాజిక స్వచ్ఛంద కార్యకర్త విద్యార్థుల ప్రతినిధులు గాదపాక కుమార్ రాజా అన్నా రు. వీటితోపాటు పూర్వవిద్యార్థులు చంద పద్మ, కూతాటి ఎల్లయ్య, బర్మావత్ మోహన్ నాయక్, తిప్పారపు రాజయ్య, గొడిశాల సదానందం, పోలోజు నరసింహ చారి అలి యాస్ రాజు, వీరి తోపాటు మరి కొందరు దాతలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు .ఈ కార్య క్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు దాతలు, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !