బాహుబలం న్యూస్ హుజూరాబాద్.
మతతత్వ పార్టీ అయిన బిజెపి పార్టీ,మోసపూరిత బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్, పార్టీనీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు లేరని “హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు” పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ మతం పేరుతో గత పది సంవత్సరాలుగా యావత్ భారత దేశాన్ని బిజెపి పార్టీ మోసం చేస్తూనే ఉందనీ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత మైన విధి విధానాలతో రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును 10 సంవత్స రాల కాలం వెనుకకు తీసుకు వెళ్లిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దలితుడే అని,ఇంటికొక ఉద్యోగం,నిరు ద్యోగయువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గత 10 యేం డ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ కెసిఆర్ కుటుం బం మొత్తం రాజయోగం అనుభవించారన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఒక్క కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరి తలరాతలు మారలేదన్నారు.ఇంతటి నిరుద్యోగతకు కెసిఆర్ నియంతృత్వ పోకటే కారణం అనిఅన్నారు.ఈ కార్యక్రమం లో మిడిదొడ్డి శ్రీనివాస్,గణేష్,ఆదినారాయణ,కుమార్,తది తరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










