బాహుబలం హుజూరాబాద్
పది జిల్లాతో ఏర్పడిన తెలంగాణను గత సీఎం కేసీఆర్.. తన లక్కీనంబర్ కలిసేలా జిల్లాల సంఖ్యను 33కు పెంచా రు.అశాస్త్రీయంగా, అసంబంద్ధంగా పాత జిల్లాలను చిలువలు పలువలుగా విభజన చేశారు.రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గా లో ఒకటిన్నర నియోజకవర్గమే ఉండడం ఇందుకు నిదర్శనం. ఇక కొన్ని జిల్లాల్లో ఒక నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉంది. దీంతో ఒక ఎమ్మెల్యే మూడు జిల్లా పరిషత్లలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి. 2016లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టిన కేసీఆర్ కొడుకు అడిగాడని ఒక జిల్లా కూతురు అడిగిందని మరో జిల్లా.. ఎవరూ అడగకపోయినా తన లక్కీ నంబర్ రావడం లేదని మరో జిల్లా.. ఇలా ఇష్టానుసారం జిల్లాలను ప్రకటించారు. పాలనా సౌలభ్యం అని ప్రకటించినా అధికా రం అంతా ప్రగతిభవన్లోనే ఉండడంతో జిల్లాల విభజనతో పెద్దగా ప్రజలకు ఒన గూరింది ఏమీలేదు. రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి దొరికింది. కొత్త జిల్లాలతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు పెరిగాయి. కొత్త మండలాలతో ఎంపీపీ పదవులు పెరిగాయి. రెవెన్యూ డివిజన్లతో ఆర్డీవోలు పెరిగారు. ఇవి మినహా ఏమీ మారలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభు త్వం ఆశాస్త్రీయ జిల్లాల విభజనపై పునః సమీక్షించాలని భావిస్తోంది. జిల్లాల సంఖ్యను కుదించాలనే ఆలోచనలో ఉంది










