విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

బాహుబలం న్యూస్ ఏప్రిల్ 25 హుజూరాబాద్
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో 2023- 24 అకాడ మిక్ ఇయర్ ముగింపు వేడుకలను గురువారం రోజున ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భం గా అకాడమిక్ ఇయర్ ముగింపు సందర్భంగా ఫలితాలను తరగతుల వారిగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ 2023 – 24 సంవత్సరం పాఠశాలకు బాగా కలిసి వచ్చిందని, ఈ సంవత్సరం చేసిన ప్రతి వేడుకకు విజ్ఞాన్ తల్లిదండ్రులను ఆహ్వానించడం జరిగిందని ప్రతి కార్యక్రమంలో పెద్ద మొత్తంలో తల్లిదండ్రులు సంతోషంగా పాల్గొ న్నారనీ తెలుపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొ ని విజ్ఞాన్ పాఠశాల అనుసరిస్తున్న లీడ్ కరికులం లో స్టేట్ టాపర్ గా నిలిచామ ని తెలియజేస్తూ, సంతోషం వ్యక్తం చేశారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కొండబత్తి ని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో లీడ్ కరికులంలో భాగంగా ఆక్టివిటీ బేస్డ్ లర్నింగ్ నీ ఇంప్లిమెంట్ చేశామని,దీని ద్వారా మంచి ఫలితాలను సాధించామని అలాగే ప్రతి నెల, నెలవారి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రోజున వెలువడిన ఇంటర్ ఫలితాలలో విజ్ఞాన్ పూర్వ విద్యార్థులు విజయ బాహుట ఎగరవేసిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. తదనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల విద్యార్థులను కూడా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….