బాహు బలంన్యూస్,వరంగల్,సెప్టెంబరు 14:
వరంగల్లోని ఆరెపల్లి కొత్తపేట క్రాస్రోడ్స్ వద్దగల అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక ఉచిత ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ప్రముఖ ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్. శ్రవణ్ కుమార్ (MBBS, MS-ENT) నేతృత్వంలో రోగులకు అధునాతన వైద్య పరీక్షలు, సలహాలు అందించనున్నారు.
ఈ శిబిరంలో చెవి నొప్పి, వినికిడి సమస్యలు, చెవిలో హోరు లేదా మోత శబ్దాలు, దీర్ఘకాలిక జలుబు, ముక్కు దిబ్బడ, రక్తస్రావం, గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది, సైనసైటిస్, తీవ్ర తలనొప్పి వంటి రుగ్మతలకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించనున్నారు.
శిబిరంలో కల్పించే ప్రత్యేక రాయితీలు:
ఉచిత ఓపీ (వైద్యుల సంప్రదింపులు)
ఉచిత ఎండోస్కోపీ మరియు వినికిడి పరీక్షలు
థైరాయిడ్ సహా అన్ని రక్త పరీక్షలపై 50 శాతం రాయితీ
ఈ శిబిరం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి. ఇతర వివరాలు, ముందస్తు అపాయింట్మెంట్ల కోసం 94598 75555 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.











