బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఆగస్టు 03 : పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్దనున్న పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి అరకిలో వెండి కిరీటాన్ని అలంకరించారు. దివంగత రావనవేణి మురళి (ఎస్టీఓ) జ్ఞాపకార్థం ఆయన సతీమణి విమల, కుమారులు సాయిరాం, వంశీలు ఈ కిరీటాన్ని బహుకరించారు.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని సమర్పించారు. అనంతరం దాతలను సంఘ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ… ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న పోచమ్మ తల్లికి, 6న పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు గుడ్డేలుగుల సమ్మయ్య, పోచయ్య, గోస్కుల సమ్మయ్య, వెంకన్న, కొలిపాక సమ్మయ్య, మౌటం శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, భూమ్ సాయికృష్ణ, రావనవేణి రాజేశం, రమేష్, భాస్కర్, బుర్రి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.










