బాహు బలంన్యూస్ సైదాపూర్, సెప్టెంబర్ 12: సైదాపూర్ మండల పరిధిలోని గొడిశాల గ్రామానికి చెందిన గిన్నారపు దుర్గయ్య కుమార్తె అఖిల పదో తరగతి (ఎస్సెస్సీ) ఒరిజినల్ సర్టిఫికెట్ పోయినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలి వివరాల ప్రకారం.. గొడిశాల జడ్పీ ఉన్నత పాఠశాలలో మార్చి 2010లో పదో తరగతి పూర్తి చేసిన ఆమె (రోల్ నంబరు: 1033124986, మెమో సీరియల్ నంబరు: KP 0849579), గత నెల ఆగస్టు 2న హుజూరాబాద్ నుంచి స్వగ్రామమైన గొడిశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యంలో మెమో జారిపడిపోయింది. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.
ఎవరికైనా ఈ సర్టిఫికెట్ దొరికితే వెంటనే ఎస్సెస్సీ బోర్డు కార్యాలయంలో గానీ, లేదా 8367752148 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు. ఒరిజినల్ మెమో లభించకపోవడంతో డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం విద్యాశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు బాధితురాలు తెలిపారు.










