బాహు బలంన్యూస్ హుజూరాబాద్, (ఆగస్టు 2):కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో ఆదివారం త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచారం నిర్వహించారు. త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో ఇంటింటా ఇందూ ధర్మ ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ… మానవరూపంలో అవతరించిన శ్రీకృష్ణుడి విశిష్టతను అందరికీ తెలియజేసేందుకే ‘ఊరు ఎరిగింపు’ (ఊరేగింపు) కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భగవంతుడైన శ్రీకృష్ణుడిని ఊరేగించిన గ్రామాల్లో ప్రకృతి వైపరీత్యాలు, రోగ బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవాసమితి కరీంనగర్ కమిటీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సభ్యులు శ్రీదేవి, శ్రీధర్, నక్షత్ర రెడ్డి, దివ్య, ఉషశ్రీ, వేణు, పృథ్వి రెడ్డి, లీలారాణి, సర్వోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











