బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఆగస్టు. 01:
న్యాయశాఖలో 37 ఏళ్ల పాటు అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ సూపరింటెండెంట్ పందిళ్ళ రాజలింగమూర్తి అందించిన సేవలు ప్రశంసనీయమని హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం రాత్రి స్థానిక హుజురాబాద్ క్లబ్లో రాజలింగమూర్తి ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జీలు పద్మ సాయిశ్రీ, వీణ ప్రణతి, న్యాయవాదులు మరియు సిబ్బంది కలిసి రాజలింగమూర్తి – భారత లక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు.
కాపిస్ట్ నుంచి సీనియర్ సూపరింటెండెంట్గా..
1989లో కాపిస్ట్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన రాజలింగమూర్తి, క్రమశిక్షణతో పదోన్నతులు పొందుతూ ఎంతో మంది జడ్జిల మెప్పు పొంది మచ్చలేని అధికారిగా సేవలు అందించారని జడ్జి కిరణ్ కుమార్ కొనియాడారు. చదువుకున్న సొంత ఊరిలోనే సీనియర్ సూపరింటెండెంట్గా విరమణ పొందడం విశేషమని, ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో గడవాలని ఆకాంక్షించారు.
అందరి సహకారానికీ కృతజ్ఞతలు
న్యాయాధికారులు, న్యాయవాదులు, సిబ్బంది నిరంతర సహకారం వల్లే తనకు మంచి పేరు వచ్చిందని, సుదీర్ఘకాలం హుజురాబాద్లోనే పనిచేయడం తన అదృష్టమని రాజలింగమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, హుజురాబాద్ కోర్టుల సిబ్బంది, పలువురు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు పందిళ్ళ విజేందర్ శర్మ, భాస్కర్ శర్మ, మల్లినాథ శర్మ తదితరులు పాల్గొన్నారు.











