తెలంగాణ వైతాళికుడు.. ప్రజాస్వామ్య పరిరక్షకుడు! ‘మెట్రో’ దార్శనికుడు కీ.శే. జైపాల్‌రెడ్డికి ఘన నివాళి.. ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు …

బాహు బలంన్యూస్, కరీంనగర్, జూలై 28:
విలువలు, సిద్ధాంతాలకు నిలువెత్తు రూపంగా నిలిచి దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ధ్రువతార కీ.శే. ఎస్. జైపాల్‌రెడ్డి అని ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. మంగళవారం కరీంనగర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జైపాల్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఢిల్లీ పీఠాన్ని ఒప్పించి… తెలంగాణ స్వప్నాన్ని నిలబెట్టి!
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ… నాటి యూపీఏ కేంద్ర ప్రభుత్వ పెద్దలను, పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలను ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్‌రెడ్డి నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకమైనదని కొనియాడారు. తన అనర్గళ ప్రసంగ పటిమ, లోతైన పార్లమెంటరీ పరిజ్ఞానంతో సభలోని విపక్ష నేతల ప్రశంసలు అందుకొని ‘ఉత్తమ పార్లమెంటేరియన్’గా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తుచేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డికి జైపాల్‌రెడ్డి మేనమామ కావడం గమనార్హమని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో తిరుగులేని శూరుడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామికంగా ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని తొలగించినప్పుడు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో జైపాల్‌రెడ్డి పోరాడిన తీరు రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని రామారావు పేర్కొన్నారు. రాంలాల్ వ్యవస్థను ఎండగడుతూ కేవలం నెల రోజుల్లోనే ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేలా ప్రజాస్వామ్య ఉద్యమానికి ఊపిరి పోశారని చెప్పారు.
హైదరాబాద్‌కు ‘మెట్రో’ మకుటం.. జైపాల్‌రెడ్డి దార్శనికత!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేయించడంలో ఆయన దార్శనికత చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అనన్యమైనవని, నేటి నవసమాజం మరియు యువత జైపాల్‌రెడ్డి రాజకీయ విలువలను, జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు అంబటి జోగిరెడ్డి, రొంటాల కేశవరెడ్డి, సంధ్యారాణి, జిల్లా అంజయ్య, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నీట్ ‘లీకేజీ’పై విద్యార్థి లోకం సమరభేరి! విద్యార్థుల అలుపెరుగని ఆందోళనకు లొంగిన ఢిల్లీ పీఠం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శుభసూచకం:….. ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు..

నీట్ అక్రమాలపై గళమెత్తిన విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి …. నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరు….. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడద్దు:….. ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ..

ప్రజాగుండెల్లో చెరగని ముద్ర… ‘దామన్న’ సేవలు చిరస్మరణీయం! ఘనంగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి వేడుకలు.. సదాశివపల్లి జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల (జే ఎ సి) జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడుసీనియర్ నాయకులు పోలాడి రామారావు …పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ముద్దసాని అభిమానులు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !