బాహు బలంన్యూస్ హుజురాబాద్ /శంకరపట్నం ,:
మండల కేంద్రమైన కేశవపట్నంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి బి. రవీందర్ తెలిపారు.
60 ఖాళీలు లభ్యం
ఈ వసతి గృహంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మొత్తం 60 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. చేరిన విద్యార్థులందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
సహకరించాలని విజ్ఞప్తి
విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా మండలంలోని ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక సంస్థలు, యువజన సంఘ నాయకులు మరియు పత్రిక విలేకర్లు తమవంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వివరాల కోసం వసతి గృహ సంక్షేమ అధికారి బి. రవీందర్ను 9963767800 ఫోన్ నంబర్లో సంప్రదించగలరని సూచించారు.










