సైదాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు అండగా ‘జై భీమ్’ యూత్ లీడర్ గడ్డం విశాల్‌ * పాఠశాల సమస్యలపై తక్షణమే స్పందన.. పోలీసులకు ఫిర్యాదు * విద్యార్థినులకు ‘నేనున్నానంటూ’ కొండంత ధైర్యం!

బాహు బలంన్యూస్ , సైదాపూర్, జూన్ 29:
మండల కేంద్రంలోని సోమవారం గ్రామంలో గల మోడల్ స్కూల్‌లో సరైన విద్యా వసతులు అందడం లేదని, అలాగే పాఠశాల పరిసరాల్లో ఆకతాయిల వేధింపులు ఎక్కువయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ పరిసరాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై సోమవారం నాడు 10వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు ‘జై భీమ్’ యూత్ లీడర్, సామాజిక కార్యకర్త గడ్డం విశాల్‌ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. “అన్నయ్యా.. మాకు సరైన విద్య అందడం లేదు, బయట వ్యక్తుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం.. మా సమస్యలను కొంచెం పట్టించుకోండి” అని విద్యార్థులు ఆయనకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన జై భీమ్ లీడర్
విద్యార్థుల ఫిర్యాదుపై గడ్డం విశాల్ తక్షణమే స్పందించారు. వెంటనే మోడల్ స్కూల్‌కు చేరుకుని అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో కొందరు బయటి వ్యక్తులు, ఆకతాయిలు సిగరెట్లు, గుట్కాలు తాగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ఆయన గమనించారు. అంతేకాకుండా, బయట తిరిగే యువకులు బైక్‌లపై స్కూల్ పరిసరాల్లోకి వస్తూ.. ఇక్కడి విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు కొండంత ధైర్యం..
ఈ సందర్భంగా గడ్డం విశాల్ విద్యార్థులతో, ముఖ్యంగా విద్యార్థినులతో మాట్లాడి వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. “మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, ఏ కష్టం వచ్చినా నేనున్నానని హామీ ఇస్తున్నాను. ఎవరూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. చదువుపై మాత్రమే దృష్టి పెట్టండి” అని వారికి భరోసా కల్పించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌తో సమావేశమై, స్కూల్ భద్రత, విద్యార్థుల భద్రత, పై విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాల పరిసరాల్లో క్రమశిక్షణ, భద్రత కరువవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. 24 గంటల్లో రక్షణ చర్యలు!
పాఠశాలలో నెలకొన్న ఈ తీవ్రమైన పరిస్థితిపై ప్రిన్సిపాల్ నుంచి రాతపూర్వక పిటిషన్ తీసుకున్న గడ్డం విశాల్, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. విద్యార్థినుల రక్షణ, స్కూల్ పరిసరాల్లో ఆకతాయిల అగడాలపై పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. రాబోయే 24 గంటల్లో పాఠశాల వద్ద సరైన భద్రత, విద్యార్థుల భద్రతపై పోలీస్ నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల దారిలో నడుస్తూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే స్పందించి అండగా నిలిచిన గడ్డం విశాల్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..