కాట్రపల్లిలో ముగిసిన దశాబ్దాల రోడ్డు కష్టాలు ఏకగ్రీవ తీర్మానంతో 40 అడుగులుగా రహదారి విస్తరణ గ్రామ ఈ కోన నుంచి ఆ కోన వరకు పనుల పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

కాట్రపల్లిలో ముగిసిన దశాబ్దాల రోడ్డు కష్టాలు ఏకగ్రీవ తీర్మానంతో 40 అడుగులుగా రహదారి విస్తరణ గ్రామ ఈ కోన నుంచి ఆ కోన వరకు పనుల పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.

25 Jun 2026, 3:22 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజురాబాద్‌ జూన్ 25 : మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇరుకైన రోడ్డు కారణంగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు, గ్రామస్థుల కష్టాలను తీరుస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఎదురెదురుగా రాలేని స్థితి నుంచి..
గతంలో కాట్రపల్లి ప్రధాన రహదారి అత్యంత ఇరుకుగా ఉండేది. కనీసం రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకదానికొకటి దాటి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి నెలకొనేది. దీంతో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం, వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్యపై స్పందించిన స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై, రోడ్డు విస్తరణ చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
ఊరంతా 40 అడుగుల సువిశాల రహదారి..
పాలకవర్గం తీర్మానం మేరకు గ్రామంలో అత్యంత పకడ్బందీగా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. గ్రామం ఈ కోన నుండి ఆ కోన వరకు.. అంటే ఊరు ఎంత పొడవు ఉందో అంత పొడవునా ఆక్రమణలను తొలగిస్తూ ఏకంగా 40 అడుగుల (40 ఫీట్ల) వెడల్పుతో సువిశాలమైన రహదారిని సిద్ధం చేశారు.
పాలకవర్గానికి గ్రామస్థుల కృతజ్ఞతలు..
దశాబ్దాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, గ్రామానికి కొత్త రూపునిచ్చినందుకు గానూ స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల హైమా, బిక్షపతి, ఉపసర్పంచ్ గంగదారి బిక్షపతిలతో పాటు ఈ అభివృద్ధి నిర్ణయంలో కీలక పాత్ర పోషించిన వార్డు సభ్యులు కోమటి శ్రీనివాస్, బాలగోని అరుంధతి కృష్ణంరాజు, తాళ్లపెళ్లి అనూష అనిల్, తాడూరి ప్రమోద్ గౌడ్, మిడివెల్లి నాగరాజు, నిమ్మల నరేష్, ముప్పు లావణ్య సహదేవ్, మాడుగుల విజయలక్ష్మి వెంకటస్వామి, మైసా అర్జున్ అందరికీ గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పాలకవర్గం మొత్తం ఏకతాటిపై నిలిచి రోడ్డు విస్తరణను విజయవంతం చేయడంతో ప్రయాణాలు సుగమమయ్యాయని ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Generating image…

బాహు బలంన్యూస్ హుజురాబాద్‌ జూన్ 25 : మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇరుకైన రోడ్డు కారణంగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు, గ్రామస్థుల కష్టాలను తీరుస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఎదురెదురుగా రాలేని స్థితి నుంచి..
గతంలో కాట్రపల్లి ప్రధాన రహదారి అత్యంత ఇరుకుగా ఉండేది. కనీసం రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకదానికొకటి దాటి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి నెలకొనేది. దీంతో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం, వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్యపై స్పందించిన స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై, రోడ్డు విస్తరణ చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
ఊరంతా 40 అడుగుల సువిశాల రహదారి..
పాలకవర్గం తీర్మానం మేరకు గ్రామంలో అత్యంత పకడ్బందీగా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. గ్రామం ఈ కోన నుండి ఆ కోన వరకు.. అంటే ఊరు ఎంత పొడవు ఉందో అంత పొడవునా ఆక్రమణలను తొలగిస్తూ ఏకంగా 40 అడుగుల (40 ఫీట్ల) వెడల్పుతో సువిశాలమైన రహదారిని సిద్ధం చేశారు.
పాలకవర్గానికి గ్రామస్థుల కృతజ్ఞతలు..
దశాబ్దాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, గ్రామానికి కొత్త రూపునిచ్చినందుకు గానూ స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల హైమా, బిక్షపతి, ఉపసర్పంచ్ గంగదారి బిక్షపతిలతో పాటు ఈ అభివృద్ధి నిర్ణయంలో కీలక పాత్ర పోషించిన వార్డు సభ్యులు కోమటి శ్రీనివాస్, బాలగోని అరుంధతి కృష్ణంరాజు, తాళ్లపెళ్లి అనూష అనిల్, తాడూరి ప్రమోద్ గౌడ్, మిడివెల్లి నాగరాజు, నిమ్మల నరేష్, ముప్పు లావణ్య సహదేవ్, మాడుగుల విజయలక్ష్మి వెంకటస్వామి, మైసా అర్జున్ అందరికీ గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పాలకవర్గం మొత్తం ఏకతాటిపై నిలిచి రోడ్డు విస్తరణను విజయవంతం చేయడంతో ప్రయాణాలు సుగమమయ్యాయని ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లిలో ముగిసిన దశాబ్దాల రోడ్డు కష్టాలు ఏకగ్రీవ తీర్మానంతో 40 అడుగులుగా రహదారి విస్తరణ గ్రామ ఈ కోన నుంచి ఆ కోన వరకు పనుల పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్‌ జూన్ 25 : మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇరుకైన రోడ్డు కారణంగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు, గ్రామస్థుల కష్టాలను తీరుస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఎదురెదురుగా రాలేని స్థితి నుంచి..
గతంలో కాట్రపల్లి ప్రధాన రహదారి అత్యంత ఇరుకుగా ఉండేది. కనీసం రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకదానికొకటి దాటి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి నెలకొనేది. దీంతో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం, వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్యపై స్పందించిన స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై, రోడ్డు విస్తరణ చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
ఊరంతా 40 అడుగుల సువిశాల రహదారి..
పాలకవర్గం తీర్మానం మేరకు గ్రామంలో అత్యంత పకడ్బందీగా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. గ్రామం ఈ కోన నుండి ఆ కోన వరకు.. అంటే ఊరు ఎంత పొడవు ఉందో అంత పొడవునా ఆక్రమణలను తొలగిస్తూ ఏకంగా 40 అడుగుల (40 ఫీట్ల) వెడల్పుతో సువిశాలమైన రహదారిని సిద్ధం చేశారు.
పాలకవర్గానికి గ్రామస్థుల కృతజ్ఞతలు..
దశాబ్దాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, గ్రామానికి కొత్త రూపునిచ్చినందుకు గానూ స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల హైమా, బిక్షపతి, ఉపసర్పంచ్ గంగదారి బిక్షపతిలతో పాటు ఈ అభివృద్ధి నిర్ణయంలో కీలక పాత్ర పోషించిన వార్డు సభ్యులు కోమటి శ్రీనివాస్, బాలగోని అరుంధతి కృష్ణంరాజు, తాళ్లపెళ్లి అనూష అనిల్, తాడూరి ప్రమోద్ గౌడ్, మిడివెల్లి నాగరాజు, నిమ్మల నరేష్, ముప్పు లావణ్య సహదేవ్, మాడుగుల విజయలక్ష్మి వెంకటస్వామి, మైసా అర్జున్ అందరికీ గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పాలకవర్గం మొత్తం ఏకతాటిపై నిలిచి రోడ్డు విస్తరణను విజయవంతం చేయడంతో ప్రయాణాలు సుగమమయ్యాయని ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !