కాట్రపల్లిలో ముగిసిన దశాబ్దాల రోడ్డు కష్టాలు ఏకగ్రీవ తీర్మానంతో 40 అడుగులుగా రహదారి విస్తరణ గ్రామ ఈ కోన నుంచి ఆ కోన వరకు పనుల పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్‌ జూన్ 25 : మండలం పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇరుకైన రోడ్డు కారణంగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు, గ్రామస్థుల కష్టాలను తీరుస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఎదురెదురుగా రాలేని స్థితి నుంచి..
గతంలో కాట్రపల్లి ప్రధాన రహదారి అత్యంత ఇరుకుగా ఉండేది. కనీసం రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకదానికొకటి దాటి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి నెలకొనేది. దీంతో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం, వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్యపై స్పందించిన స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై, రోడ్డు విస్తరణ చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
ఊరంతా 40 అడుగుల సువిశాల రహదారి..
పాలకవర్గం తీర్మానం మేరకు గ్రామంలో అత్యంత పకడ్బందీగా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. గ్రామం ఈ కోన నుండి ఆ కోన వరకు.. అంటే ఊరు ఎంత పొడవు ఉందో అంత పొడవునా ఆక్రమణలను తొలగిస్తూ ఏకంగా 40 అడుగుల (40 ఫీట్ల) వెడల్పుతో సువిశాలమైన రహదారిని సిద్ధం చేశారు.
పాలకవర్గానికి గ్రామస్థుల కృతజ్ఞతలు..
దశాబ్దాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, గ్రామానికి కొత్త రూపునిచ్చినందుకు గానూ స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల హైమా, బిక్షపతి, ఉపసర్పంచ్ గంగదారి బిక్షపతిలతో పాటు ఈ అభివృద్ధి నిర్ణయంలో కీలక పాత్ర పోషించిన వార్డు సభ్యులు కోమటి శ్రీనివాస్, బాలగోని అరుంధతి కృష్ణంరాజు, తాళ్లపెళ్లి అనూష అనిల్, తాడూరి ప్రమోద్ గౌడ్, మిడివెల్లి నాగరాజు, నిమ్మల నరేష్, ముప్పు లావణ్య సహదేవ్, మాడుగుల విజయలక్ష్మి వెంకటస్వామి, మైసా అర్జున్ అందరికీ గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పాలకవర్గం మొత్తం ఏకతాటిపై నిలిచి రోడ్డు విస్తరణను విజయవంతం చేయడంతో ప్రయాణాలు సుగమమయ్యాయని ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..