కాట్రపల్లి గ్రామసభలో ప్రజాసమస్యలపై చర్చ ’99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా నిర్వహణ ఈ ఏడాది నుంచే ప్రీ-ప్రైమరీ స్కూల్ ప్రారంభం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 06:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా శనివారం కాట్రపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి అధ్యక్షతన, స్పెషల్ ఆఫీసర్ రాజేందర్, ఉప సర్పంచ్ గంగదారీ బిక్షపతి సమక్షంలో జరిగిన ఈ సభకు వివిధ శాఖల అధికారులు హాజరై ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.
గ్రామసభలో పారిశుద్ధ్య లోపం, వేలాడుతున్న విద్యుత్ లైన్ల సమస్యలపై గ్రామస్థులు అధికారులను నిలదీయగా, పరిష్కారానికి విద్యుత్ లైన్‌మెన్ హామీ ఇచ్చారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేయగా.. బాలల సంరక్షణ విభాగం ప్రతినిధి రమేష్ అవగాహన కల్పించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రీ-ప్రైమరీ తరగతులు.
కాట్రపల్లి గ్రామానికి ఈ విద్యాసంవత్సరం నుంచే నూతనంగా ప్రీ-ప్రైమరీ స్కూల్ మంజూరైనట్లు, ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు సభలో వెల్లడించారు. అనంతరం ఏఈఓ నిఖిల్ కుమార్ రైతులకు సాగు విధానాలపై, ఇరిగేషన్ అధికారులు చెరువుల పరిస్థితిపై, వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధుల నివారణపై మాట్లాడారు.
సర్పంచ్ హైమా బిక్షపతి మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణ ద్వారా వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి, నిధులు కేటాయించి కాట్రపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

నీట్ ‘లీకేజీ’పై విద్యార్థి లోకం సమరభేరి! విద్యార్థుల అలుపెరుగని ఆందోళనకు లొంగిన ఢిల్లీ పీఠం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శుభసూచకం:….. ప్రజా సంఘాల జేఏసీ నేత పోలాడి రామారావు..

నీట్ అక్రమాలపై గళమెత్తిన విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి …. నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరు….. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడద్దు:….. ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ..

ప్రజాగుండెల్లో చెరగని ముద్ర… ‘దామన్న’ సేవలు చిరస్మరణీయం! ఘనంగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి వేడుకలు.. సదాశివపల్లి జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల (జే ఎ సి) జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడుసీనియర్ నాయకులు పోలాడి రామారావు …పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ముద్దసాని అభిమానులు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !