రైతు రక్షణలో ప్రభుత్వం విఫలం.. పోలాడి రామారావు ……వాయిదా పడ్డ ‘మహాగర్జన’.. మే 30న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఏప్రిల్ 26: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ, ధాన్యం కొనుగోళ్లలో సహాయ సహకారాలు అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి, చెల్పూర్, శాలపల్లి, రాంపూర్, జూపాక, కందుగుల, బోర్నపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి, ధాన్యం విక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
మే 30కి ‘మహాగర్జన’ వాయిదా
ఈ నెల 28న కరీంనగర్‌లో నిర్వహించాల్సిన ‘రైతుల మహాగర్జన సమరభేరి’ సభను మే 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రామారావు ప్రకటించారు. ప్రస్తుతం వరి కోతలు పూర్తికాకపోవడం, రైతులు బిజీగా ఉండటంతో వివిధ సామాజిక వర్గాలు, విద్యార్థి సంఘాల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే 30న సుమారు రెండు లక్షల మందితో భారీ ఎత్తున ఈ సభను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తం
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించిందే తప్ప, వాస్తవానికి కొనుగోళ్లు జరపడం లేదని రామారావు ఆరోపించారు. “అకాల వర్షాలతో రైతులు వణికిపోతుంటే, కనీసం టార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు తమ పంటను తక్కువ ధరకే ప్రైవేటు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకు, ప్రైవేటు వ్యక్తులకు మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాల వల్లే రైతులకు ఈ దుస్థితి దాపురించింది” అని ఆయన మండిపడ్డారు.
నిలువు దోపిడీ.. బోనస్‌కు ఎసరు!
క్వింటాల్‌కు తాలు, మట్టి లేని ఎండు ధాన్యానికి కూడా అదనంగా ఆరు కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ ఇవ్వకుండా తప్పించుకోవడానికే, కావాలనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అప్పటికే 60 శాతం ధాన్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని గుర్తు చేశారు.
రైతు భరోసాపై నిర్లక్ష్యం
సాగు సమయంలో ఇవ్వాల్సిన ‘రైతు భరోసా’ నిధులను ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టిందని, ఇప్పుడు పంట కోత దశలో అరకొరగా, విడతల వారీగా ఇవ్వడం దారుణమని రామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొండాల్ రెడ్డి, మూగల శ్రీధర్ రెడ్డి, శ్రావణ్, సమ్మీరెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరాటం. మద్దతు ప్రకటించిన రాష్ట్ర మహిళా సంఘాలు; 8 వేల మందితో హాజరవుతామని వెల్లడి. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.