బాహు బలంన్యూస్,హుజూరాబాద్ ఏప్రిల్ 15,:
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు బోడ వినోద్ ప్రతిష్టాత్మక ‘దళిత రత్న – 2026’ పురస్కారాన్ని అందుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి మరియు బాబు జగజీవన్రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని, హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా మంగళవారం ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
కళా ప్రదర్శనలతో సామాజిక చైతన్యం.
దళిత వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం బోడ వినోద్ గత కొంతకాలంగా తన కళా ప్రదర్శనల ద్వారా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలపై పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆయన సామాజిక సేవలను గుర్తించిన తెలంగాణ అంబేద్కర్ ఉత్సవ కమిటీ, ఈ ఏడాదికి గానూ ఆయనను ‘దళిత రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది.
ప్రముఖుల చేతుల మీదుగా సత్కారం.
రవీంద్రభారతిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రముఖుల సమక్షంలో వినోద్ను ఘనంగా సన్మానించారు. తెలంగాణ అంబేద్కర్ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ రోజా రాణి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, సామాజిక వేత్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని వినోద్ను అభినందించారు.
గ్రామంలో హర్షాతిరేకాలు
తుమ్మనపల్లి వంటి చిన్న గ్రామం నుండి ఎదిగి, రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడంపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన బోడ వినోద్ను గ్రామస్తులు మరియు దళిత సంఘాల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.











