కరీంనగర్ ‘రైతు మహాగర్జన’కు తరలిరండి: సబ్బండ వర్గాలకు రైతు ప్రజాసంఘాల జేఏసీ పిలుపు. ఓసి రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు .

బాహు బలంన్యూస్ కరీంనగర్ మార్చి 25: వచ్చే నెల 28వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ‘రైతుల మహాగర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. సుమారు లక్ష మందితో నిర్వహించే ఈ భారీ సభకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ ఓసి రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి బృందం హైదరాబాద్‌లో పలు సామాజిక సంఘాల నేతలను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
బిసి సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, 57 ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు భైరి వెంకటేష్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షుడు తడగొండ సత్యరాజ్ వర్మ, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్ తదితరులను కలిసి సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విన్నపానికి సానుకూలంగా స్పందించిన నేతలు, వేలాది మందితో సభకు తరలివస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి రైతు జేఏసీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తుతూ సమరభేరి
బుధవారం కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పోలాడి రామారావు, సంధి తిరుపతి రెడ్డిలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులను తగ్గించడమే కాకుండా, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేస్తూ రైతులను మోసగిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా నిధులు విడుదల చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాతలతో పాటు విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 28న కరీంనగర్ వేదికగా లక్షలాది మందితో ‘సమరభేరి’ మోగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పెండ్యాల రాంరెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..