బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూలై 5: తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సంఘ భవనంలో ఈరోజు హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను ఘనంగా సత్కరించారు. ఇటీవలి కాలంలో హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఆయన అందించిన విశేష సేవలకు గాను, అలాగే రాష్ట్రస్థాయిలో ఉత్తమ కమిషనర్గా ప్రశంసలు అందుకున్న సందర్భంలో అసోసియేషన్ పక్షాన శాలువాతో సన్మానం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ పాషా, కోశాధికారి కె. దుర్గా జి, ప్రచార కార్యదర్శి గంజి జవర్ధన్, జిల్లా కౌన్సిలర్లు పి. లక్ష్మీనారాయణ, చింత ఆగయ్య, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు విలాసాగరం వీరాస్వామి, కబడ్డీ సమ్మిరెడ్డి, వెలుపల రత్నం, మాజీ ఎంఈఓ ఆర్. రాజయ్య, గంగిశెట్టి జగదీశ్వర్, కె. వెంకటరెడ్డి, రిటైర్డ్ ఏఈ బోర్గాల మొగిలి, జున్నోతుల రామ్ రెడ్డి, మరియు ఎన్. తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మయ్య సేవలను కొనియాడుతూ, అసోసియేషన్ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.










