ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్ఎఫ్‌ఐ

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూలై 5:
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పొడిశెట్టి అభిలాష్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ తాసిల్దార్ కె. కనకయ్యకు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా పొడిశెట్టి అభిలాష్ మాట్లాడుతూ, ఫీజు బకాయిల వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి బలవంతంగా పెండింగ్ ఫీజులను వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లాలంటే సర్టిఫికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని కళాశాలలు ఒత్తిడి చేసి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయని అభిలాష్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన ఆరోపించారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సందీప్, బాలాజీ, సాయికిరణ్, సిద్దు, ప్రణయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….