రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

బాహు బలంన్యూస్ ప్రతినిధి హుజూరాబాద్, ఏప్రిల్ 19: మండలంలోని రంగాపూర్ కల్వరి టెంపుల్‌లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. చర్చి ఫాదర్ రెవ. డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలను సంఘ సభ్యులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బండ ప్రియాంక, బండ మాధవి, బొడ్డు హర్షవర్ధన్, బండ స్నేహ, శనిగరపు ప్రవీణ, తిరుగమల్ల కవిత, కూచన విష్ణువర్ధన్‌లు యేసు ప్రభువు చివరి మాటల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసు మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు.
నలభై రోజుల ఉపవాస దీక్ష ముగింపు సందర్భంగా మాడుగుల ఆశీర్వాదం గారి స్నేహితులు సురేష్, సుజాత దంపతులు సంఘ సభ్యులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే, నెల్సన్ పాస్టర్ కుటుంబం నుండి ఎగ్ పప్స్, బండ రమేష్, మాధవి దంపతుల నుండి జ్యూస్‌ను అందించారు.
ఫాదర్ నెల్సన్ గారు గుడ్ ఫ్రైడే యొక్క ప్రత్యేక సందేశాన్ని భక్తులకు వినిపించారు. సంఘ క్వయర్ బృందం ఆలపించిన పాటలతో సంఘ సభ్యులు కన్నీటితో క్రీస్తును ఆరాధించారు. అనంతరం ఫాదర్ నెల్సన్ దంపతులు అందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !