రాజీవ్ యువజన వికాస్ యోజన పథకం గడువు మరోసారి పొడిగించాలి — 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు

బాహు బలంన్యూస్ హుజురాబాద్, ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస యోజన పథకం గడువును మరోమారు ఈ నెల ఏప్రిల్ 30వ తారీకు వరకు పొడగించాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం లో ప్రతి లబ్ధిదారునికి నాలుగు లక్షలు గరిష్టంగా యూనిట్ కు మంజూరు చేయాలని తెలిపారు. రాజీవ్ యువ వికాస యోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డులు తప్పకుండా అడుగుతున్నారని, ఒకవేళ రేషన్ కార్డు లేనిచో ఆదాయ ధ్రువీకరణ పత్రం అడుగుతున్నారని, దీనితో దరఖాస్తు చేసుకునే వారికి చాలా ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి ఏప్రిల్ 14వ తేదీ వరకు గడవు పెంచినప్పటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని మీసేవ, ఆన్ లైన్ కేంద్రాలలో గత మూడు రోజులుగా సర్వర్ పనిచేయక దరఖాస్తుదారులకు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మూడు రోజులు సర్వర్ రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేక దరఖాస్తుదారులు తీవ్ర అసౌకర్యాలకు గురికావాల్సి వస్తున్నదని, కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఈనెల ఏప్రిల్ 30 వరకు గడవు పొడిగించాలని, నూతన రేషన్ కార్డులు త్వరగా అర్హులకు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !