ట్రాన్స్‌జెండర్లను అవహేళన… బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర నిరసన అసెంబ్లీలో అవహేళన… ఎమ్మెల్యేల తీరుపై మండిపాటు. క్షమాపణ చెప్పాలని డిమాండ్. మా జీవితాల్లో వెలుగు తెచ్చిన నిర్ణయాన్ని అవహేళన చేయడం ఎందుకు? : ట్రాన్స్‌జెండర్లు

బాహు బలంన్యూస్,హూజురాబాద్ ప్రతినిధి మార్చి28: హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం ముందు ట్రాన్స్‌జెండర్లు ర్యాలీగా వచ్చి నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమను అవహేళన చేయడం అనైతికమని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “50 మంది ట్రాన్స్‌జెండర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ట్రాంజెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాం” అని ప్రకటించారు.అయితే,ఈ ప్రకటన చేస్తుండగానే బీఆర్ఎస్‌కు చెందిన హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ లు హేళనగా నవ్వడం మమ్ములను కించపరిచారని అన్నారు. దీనిపై హుజురాబాద్ ,ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ తీవ్రంగా మండిపడ్డారు. నిరసనలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇచ్చి, సమాజంలో మనుగడ కోసం సహాయం చేశారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్ముల ను అవహేళనగా చూడటం బాధాకరం” అని అన్నారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాపై ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు మేము గౌరవప్రదమైన పని చేసుకుంటుంటే, దానిని కూడా అవహేళన చేస్తారా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ట్రాన్స్‌ జెండర్లు డిమాండ్ చేశారు. “ఇది వ్యక్తిగతంగా మాకు మాత్రమే కాదు, మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజానికి అవమానం” అని వారు అన్నారు. “మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఈ వ్యవహారాన్ని ఖండించాలి. ట్రాన్స్‌జెండర్లను హేళన చేయడం కేవలం వారినే కాదు, సమాజంలో సమానత్వాన్ని కాంక్షించే వారందరినీ అవమానించడమే” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ అధ్యక్షులు రోంటాల కుమారి ,నియోజకవర్గ ఉపాధ్యక్షులు గాజుల హరిత, కోశాధికారి సంధ్య, కమ్యూనిటీ సభ్యులు రవళి , శ్రీవల్లి , సత్య,సంధ్య, విజ్జి, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !