జియో ఫైబర్ నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం. కస్టమర్‌ కేర్‌ స్పందన కరువు. ఆందోళనలో వినియోగదారులు…

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 20: హుజురాబాద్ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి జీవో ఫైబర్ నెట్వర్క్ సేవలు పని చేయడం లేదని పట్టణంలోని విద్యానగర్,కాకతీయకాలనీ వాసులు మండిపడుతున్నా రు.ముకేష్‌ అంబానీకి చెందిన రియలన్స్‌ జియో ఫైబర్‌ సేవలకూ అంతరాయం ఏర్పడడం పట్టణంలో జియో కస్టమర్ కేర్ స్పందన లేకపోవడం వినియోదారులు వాపోతు న్నారు. పట్టణంలో 17 ఫిబ్రవరి 2025 సోమ వారం ఉదయం నుంచే సమస్య ఉత్పన్నం కావడంతో జియో ఫైబర్, ఇంటర్నెటు సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వర్క్ ఫ్రం హోం జాబ్ చేసేవు వారికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వల్ల ఇబ్బందిగా మారిందని పేర్కొంటున్నారు.విద్యానగర్, కాకతీయ కాలనీలో, జియో ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపుగా 2000 మంది వినియోగదారు ఉంటారని జియో ఫైబర్ సేవలపై వినియోగదారు లు కస్టమర్‌ కేర్‌ను సంప్రదించిన సరిగా స్పందించడం లేదంటూ వాపోయారు. ఇతర నెట్‌వర్క్‌ల సహాయం తో సోషల్‌ మీడియా వేదికల్లో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జియో ఫైబర్ నెట్వర్క్ సేవలను పునరుద్ధరించాలని కాలనీ వాసులు జియో యాజమాన్యాన్ని కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !