ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ

బాహుబలం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: శనివారం రోజు తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వ ర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి తెలంగాణ ఆదివాసి ఎరుకల సమస్యలపై 9వ తేదీనాడు జరిగే శాస నమండలి సభలో తమ తరఫున సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు నాయకత్వంలో ఆమెకు వినతి పత్రం అందజేశారు.

పెండింగ్ లో ఉన్నటు వంటి సమస్యలు; హైదరాబాద్ నిజాంపేట్ లో ఎరుకల ఆత్మగౌరవ భవనంను పూర్తిచేయాలని, పందుల పెంపకం పై ఆధారపడి జీవిస్తు న్న ఎరుకల కుటుంబాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంను యధావిధిగా కొనసాగించాలని, చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక ఆదివాసి ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినార ని, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన సమస్యలను పరిష్కారం కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాల ని, గత ప్రభుత్వం ఎరుకల నాంచారమ్మ జాతరకు రూ .5 లక్షల బడ్జెట్ కేటాయించినారు కానీ సరిపోలేదనీ, కావున కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల బడ్జెట్ కేటాయించాలన్నారు. ఓరుగల్లు ములుగు జిల్లా రామంజపురం గ్రామంలో కాకతీ య రాజులు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎరుకల నాంచారమ్మ పంచకూటాలయం పునర్ నిర్మించాలని కోరడం జరిగిందని రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతడి రవి కుమార్,రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, రాష్ట్ర కోశాధికారి వనం రమేష్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్, కేతిరి రాజ శేఖర్, దేవరాజు యాదగిరి, బాణాపురం శ్రీరాములు, లోకి నీ సమ్మయ్య, మానుపాటి రమేష్, ఓని సదానందం, ఎల్బీ నగర్ అధ్యక్షుడు ఉండ్రాతి రవి కుమార్,శివ,సతీష్, మ ల్లూరు ప్రసాద్, కుతాటి యాదగిరి తదితరులు పాల్గొన్నా రు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !