బాహు బలం న్యూస్ హుజురాబాద్
సెప్టెంబర్ 11:హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక.హుజురాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీ కళ్యాణ మండపంలో చేనేత వస్త్ర పదర్శన, అమ్మకాలను గందె రాధిక జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.చేనేత హస్తకళలను ప్రోత్సహించాలన్నారు. తక్కువ ధర,ఎక్కువ మన్నిక ఉంటుందని తెలిపారు. చేనేత వస్త్రాలు వినియోగించడం వలన నేతన్నలకు పని కల్పించి వారి భవిష్యతుకు సహకరించిన వారం అగుతామని ఆమె ఆకాంక్షించారు. ప్రొద్దుటూరు చేనేత సమాఖ్య ఆధ్వర్యంలో రాజేష్,అతని సిబ్బంది హస్తకళా మేళ నిర్వహిస్తున్నార నీ,మహిళలు మెచ్చే మంగళగిరి,ఉప్పాడ,వెంకటగిరి,జైపూర్ కాటన్ ప్రింటింగ్ వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారు.పోచంపల్లి దుప్పట్లు, మీరట్ ఖాది రెడీమేడ్ దుస్తులు,ఉత్తర్ ప్రదేశ్ సారంగాపూర్ చెక్క సామాగ్రి,పాతబస్తీకి చెందిన ముత్యా ల హారాలు, రంగుపూసల హారాలు మహిళా వినియోగదా రులను ఆకట్టుకుంటున్నాయి.











