ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు

సబ్బని వెంకటస్వామి ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేయాల ని కోరుతూ యువజన కాంగ్రెస్ నాయకులు స్థానిక హుజూరా బాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా భయానక వాతావరణానికి తెరలేపి లేనిపోని గొడవలు,విధ్వంసాలు సృష్టిస్తూ ప్రాంతీయ విబేధాలు అంటూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.ఇరు పార్టీల నాయకుల ను(కాంగ్రెస్,బిఆర్ఎస్ )రెచ్చగొడుతూ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు సృష్టించి రాజకీయంగా కౌశిక్ రెడ్డి తమ పార్టీ పెద్దల వద్ద మన్ననలు పొందడం కోసం అదేవిధంగా సామాజిక మాధ్య మాల్లో,మీడియాలో ఎప్పటికీ ఏదోఒక వార్తల్లో నిలవడం కోసం మహిళలను కించపరుస్తూ చీర,గాజుల అంటూ మీడి యా ద్వారా గొడవలు సృష్టిస్తున్నారన్నారు.అధికారుల విధుల కు ఆటంకం కలిగిస్తూ ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తుల పట్ల తెలంగాణ సమాజాన్ని పరిరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకు లు సందమల్ల నరేష్,టేకుల శ్రావణ్,నాయకులు బండ నవీన్ ,జంగ అనిల్,లంకదాసరి గంగరాజు,ఇప్పలపల్లి చంద్రశేఖర్, నరెడ్ల వినోద్ రెడ్డి,చల్లూరి విష్ణు వర్ధన్,చెంచల మణిదీప్, జన్ను ప్రసాద్,ఆకునూరి అజిత్,నాగరాజు,కార్తికేయ తదితరు లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….