కొత్తూరు సువర్ణకు జయన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హూజురాబాద్ ఆగస్టు 10:
హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణకు మెదడులో రక్తం గడ్డ కట్టి ప్రమాదకరమైన స్థితిలో రెండు నెలల క్రితం హైదరాబాదులో హాస్పిటల్ లో చేరటం జరిగింది . వైద్యులు పరీక్షించి అన్ని రకాల పరీక్షలు చేసి మెదడు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. రోజువారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న జీవన్ కుమార్ ఆపరేషన్ ఖర్చులకు తనశక్తి మేరకు బంధువులు , పరిచయస్తులు , స్నేహితులు దగ్గర లక్షల రూపాయలు అప్పులు చేసి ఆపరేషన్ చేయించాడు. ప్రస్తుతం సోమాజిగూడ లోని గుడ్ లైఫ్ రిహాబిటేషన్ సెంటర్ లో చికిత్స జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డి తనవంతు సహాయంగా శనివారం 10 వేల రూపాయలను జీవన్ కుమార్ కు అందజేశారు , అంతేకాకుండా అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి ధైర్యాన్ని అందించాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్ ఎమ్ఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు భువన చంద్ర , సీనియర్ గాయకుడు రామ్ రాజేశ్వర్, బత్తుల రాజలింగం, రామ్ సారయ్య, దాట్ల ప్రభాకర్, కలకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..