బాహుబలం న్యూస్ హన్మకొండ ఆగస్టు 11:
జన విజ్ఞాన వేదిక హన్మకొండ జిల్లా కమిటీ 5వ మహాసభలు కిషన్ పురలోని వాగ్దేవి విద్యా సంస్థల ఆడిటోరియంలో ఆచార్య కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాకతీయ యూనివర్సిటీ రిజిస్టార్ ఆచార్య మల్లారెడ్డి మాట్లాడుతు భారత్ కు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి భారత్ ఆశించినమేర వివిధ రంగాలలో అభివృద్ధి చెందలేదు దీనికి కారణం ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరకపోవడమే అన్నారు.ప్రజానీకం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకొని శాస్త్రీ యంగా ఆలోచించిన నాడే అభివృద్ధి చెందిన దేశం అవుతుందన్నారు.ప్రధానవక్త గా వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతు భారత్ లో మేధావులుగా పిలవబడుతున్న వారిలో కూడా మూఢనమ్మకాలు ప్రబలుతున్నాయి, ఈ అంతరం తగ్గాల్సిన అవసరం ఉంది అందుకు జనవిజ్ఞాన వేదిక ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లి కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జరిగిన వైజ్ఞానిక సదస్సులో నిట్ విశ్రాంత ఆచార్యులు రామచంద్రయ్య “శాస్త్రీయ దృక్పథం- ప్రస్తుత ఆవశ్యకత” అనే అంశంపైన, విశ్రాంత అటవీశాఖాధికారి పురుషోత్తం “అవయవ దానం- సామాజిక బాధ్యత” అనే అంశం పైన,విశ్రాంత ఆచార్యులు కే లక్ష్మారెడ్డి జనవిజ్ఞాన వేదిక ఆశయాలు కార్యక్రమా పైన, ఏసీపి విజయకుమార్ ప్రజలు సైబర్ నేరస్తుల చేతిలో చిక్కుకుండా ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా వివరించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సదస్సులో ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు గత రెండు సంవత్సరాలు గా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు.డాక్టర్ శ్రీనివాస్ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు.సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం రాబోయే రెండు సంవత్సరాలకు గాను నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షుడిగా కాజీపేట పురుషోత్తం,ప్రధాన కార్యదర్శిగా రామంచ బిక్షపతి,కోశాధికా రిగా పరికిపండ్ల వేణు,ఉపాధ్యక్షులుగా డాక్టర్ రాములు, ప్రొఫెసర్ కాశీనాథ్,ఉమామహేశ్వరరావు,శ్రవణ్ కుమార్, సుమలతలు,కార్యదర్శులుగా కుమారస్వామి,బిక్షపతి, దయాకర్,వందనలు,సబ్ కమిటీ కన్వీనర్లుగా కె బి ధర్మ ప్రకాష్,సాగంటి మంజుల,ప్రభాకరాచారి,ప్రొఫెసర్ ఆంజనేయు లు,పాల కుమారస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.










