బాహుబలంన్యూస్ హుజూరాబాద్ జూన్29:
హూజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు, సీనియర్ పాత్రికేయుడు పత్తి విష్ణు వర్ధన్ రెడ్డి(40) గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మరణించారు.విషయం తెలుసుకున్న హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత శని వారం రోజున విష్ణు వర్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సొల్లు సునీత,సుశీల,లావణ్య,లక్మి, రాధ,తిరుమల, కరిమా,రిబ్కా తదితరులు పాల్గొన్నారు.
Post Views: 77










