కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు

(సబ్బనివెంకటస్వామి బాహుబలం ప్రతినిధి)

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి మరోసారి నోటీసులు జారీ చేశారు.చత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి,భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కమిషన్ ముందు వివరణ ఇవ్వడానికి,ఆధారాలు సమర్పించేందుకు,సాక్షులను క్రాస్​ఎగ్జామిన్​ చేసేందుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్,1952 సెక్షన్ 8బీ, 8సీ కింద ఈ నెల 19నే నోటీసులు ఇచ్చారు.”పబ్లిక్​నోటీసు ఆధారంగా కొందరు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యారు.వాళ్ల వాదనలు రికార్డు చేశాం.ఇందులో కోర్టు విట్​నెస్​కింద కె.రఘు,కోదండరాం,తిమ్మారెడ్డి,వేణుగోపాల్​రావు,గోపాలకృష్ణన్​ఉన్నారు.మీరు వ్యక్తిగతంగా హాజరై తగిన ఆధారాలను సమర్పించేందుకు,కమిషన్​ముందు వాదనలు వినిపించేందుకు,విట్​నెస్​లను క్రాస్​ఎగ్జామిన్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’అని అందులో పేర్కొన్నారు.

11న తొలిసారి నోటీసులు..

ఈ నెల 11న కేసీఆర్ కు కమిషన్ తొలిసారి నోటీసులు ఇచ్చింది.15లోగా వివరణ ఇవ్వాలని అప్పట్లో ఆదేశించింది.అయితే దీనిపై కమిషన్ కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు.
రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని అందులో ఆరోపించారు.”ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు వేయకూడదన్న కనీస ఇంగీతం కూడా రేవంత్ ప్రభుత్వానికి లేదు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన మీరు.. ప్రభుత్వ నిర్ణయం సరికాదని సూచించకుండా,బాధ్యతలు స్వీకరించడం విచారకరం’అని జస్టిస్ నర్సింహారెడ్డిని ఉద్దేశించి అన్నారు.కాగా,కేసీఆర్ లేఖ రాసిన తర్వాత 9 రోజులకు ఆయనకు కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..