ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి హన్మకొండ జిల్లా పిఆర్టియు ప్రధాన కార్యదర్శి రావులకార్ వెంకటేష్

(వెంకట్ జిల్లా ప్రతినిధి హన్మకొండ )
బాహుబలంన్యూస్ హన్మకొండ మే 29:
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని హనుమకొండ జిల్లా వి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శి రావులకార్ వెంకటేష్ కోరారు. మంగళవారం సాయంత్రం ఆయన హుజరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సక్రమంగా శాంతియుతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు గ్రాడ్యుయేట్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలాకాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే ప్రభుత్వం చేపట్టాలని, సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, భార్య ఒక చోట భర్త మరొకచోట వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, 317 జీవో బాధితులకు తగు న్యాయం చేయాలని, పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులతోపాటు ఇతర పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒకే సమయపాలన ఉండాలని, పార్లమెంటు ఎన్నికల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంపాదిత సెలవుల జీవో విడుదల చేయాలని, బ్లాక్ లిస్టులో పెట్టిన ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని , నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న, సందిగ్ధంలో ఉన్న కామన్ సర్వీస్ రూల్స్ పై కొత్తగా కమిటీ వేసి ఉపాధ్యాయుల యొక్క న్యాయపరమైన కోరికలను తప్పకుండా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన సుమారు ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వ బడుల యొక్క పటిష్టతకు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్రం తరపున, వివిధ ప్రభుత్వ శాఖల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !