(సబ్బని వెంకటస్వామి ప్రతినిధి)
బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 29:హుజరాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో ఎన్టీఆర్ 101 జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామగిరి అంకుష్ మాట్లాడుతూ మండల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి పరిపాలనను ప్రజలకు చేరువ చేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వర్ధినేని లింగారావు,బీసీ సెల్ అధ్యక్షులు కామాని రాజేశం,మాజీ పట్టణ అధ్యక్షులు ప్రతాపరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి శివ కోటేశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ ఆడెపు రవి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబాల శంకర్,సంజీవ్ , శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 107










