బాహుబలం న్యూస్ హుజూరాబాద్,మే 28
మండలంలోని చెల్పూర్ గ్రామంలో మంగళవారం హనుమాన్ మాలధారణ స్వాములు చేపట్టిన గ్రామ సంకీర్తణ భక్తులను ఆకట్టుకుంది. ఉదయం హనుమాన్ మాలధారణ భక్తులు హనుమాన్ దేవాలయం నుంచి గ్రామ పురవీధుల గుండా రథంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి ఊరేగింపు నిర్వహించారు.స్వాములు భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ శ్రీరాముడు,ఆంజనేయుని నామస్మరణలతో నృత్యాలు చేస్తూ రథోత్సవాన్ని కొనసాగించగా మహిళలు మంగళహారతులతో దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు రాజ్, సంపత్, మహిపాల్,సందీప్,స్వామి,శ్రీధర్,అంజి, వీరాజంనేయ,బద్రి,రవి,రమేష్,అర్జున్,స్వామి,రమేష్, రిత్విక్,దినేష్ భక్తులు పాల్గొన్నారు.
Post Views: 300










