బాహుబలం న్యూస్.మే17హుజురాబాద్
శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున పట్టణంలోని విశ్వకర్మ మనుమయ సంఘంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ వింత జరిగినా’బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు’అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటూన్నారని అన్నారు.
కాలజ్ఞాన తత్వాలను బోధించిన,సాక్షాత్ దైవ స్వరూపుడైన శ్రీ శ్రీ శ్రీ పోతూలూరి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానం లో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి ఈ కాలజ్ఞాన ప్రభోదకర్త ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ప్రతియేటా వైశాఖ శుద్ధ దశమి రోజు సిద్ధ సమాధి,శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, ఘనంగా విశ్వకర్మమనుమయ సంఘం భవనంలోనిర్వహించడం జరుగుతుందని విశ్వకర్మ మనుమయ సంఘం పట్టణ,మండల అధ్యక్షులు చల్లూరి రఘుచారి,తాటికొండ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపఅధ్యక్షులు చక్కనం శ్రీనివాస్,ముఖ్య సలహాదారు డు కోరపల్లి చారి,ప్రధాన కార్యదర్శి ఎగ్గోజు నరసింహచారి, కోశాధికారి వేమునూరి రాజు,సహకార్యదర్శి బండ్లోజు లింగమూర్తి,ఎదులాపురం సదానందం,సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు










