బాహుబలం న్యూస్.సైదాపూర్ మే 08
సైదాపూర్ మండలం గొడిశాల గ్రామ మాజీ సర్పంచ్ చింత లతా కుమార్.బుధవారం రోజున రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ గుడిశాల మాజీ సర్పంచ్ లతా కుమార్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా లతాకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలకు గ్యారెంటీలు ప్రజలకు చేరుతున్నాయని మరింత గ్రామ ప్రజలకు అందజేయాలని ఉద్దేశంతో,కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దొంత సుధాకర్,సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్,కే,రాజేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు ముక్కెర శోభ,పోగు రమేష్,గ్రామ శాఖ అధ్యక్షులు చిట్యాల చంద్రమౌళి,గుర్రం మహేష్,యూత్ ప్రెసిడెంట్ రాహుల్ రెడ్డి దాసరి మల్లేషం,పూదరీ గణేష్ , ఎం.లింగమూర్తి,మిడిదొడ్డి ప్రవీణ్,మునిగంటి యాదయ్య, ములుగు రాములు,సుధాకర్,కుమారస్వామి,వేల్పుల రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు










