మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో.. సర్పంచ్ ల ఫోరంమాజీ అధ్యక్షులు, పలువురు మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరిక

సైదాపూర్ బహుబలం న్యూస్ మే 7
హుస్నాబాద్ నియోజకవర్గం లోని సైదాపూర్ మండలం సర్పంచుల పూర్వం మాజీ అధ్యక్షులు కొండ గణేష్, రాయికల్ తండా మాజీసర్పంచ్ బర్మావత్ అక్షయ శ్రీనివాస్ మంగళవారం రోజున రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కొండ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు వెంటనే అమలు చేసి ప్రజలకు అందిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పథకాలకు ఆకర్షితులై ప్రజలకు మరింత సేవ చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన అన్నారు. వెక్కెపల్లి మాజీ సర్పంచ్ సైదాపూర్ మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కొండ గణేష్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నుండి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది.దశబ్దలకాలంగా యూత్ అధ్యక్షుడుగా సైతం కొండ గణేష్ పార్టీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించా రు.కొండ గణేష్ తోపాటు మరికొందరు మాజీ సర్పంచులు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం.కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్,జిల్లా నాయకులు గుండారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా మంత్రి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు వెల్ది రాజు,కచ్చు రవీందర్,గోడిశాల మాజీ సర్పంచ్ పోగు రమేష్, మేకల రాజు,గడ్డం స్వామి,గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !