ఏసీబీకి పట్టుబడ్డ డిపో మేనేజర్

ఏసీబీకి పట్టుబడ్డ

హుజురాబాద్, ఏప్రిల్ 15 హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఘటన సోమవారం చోటుచేసుకుంది. హుజురాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ తాడికొండ రవీందర్ కు డిపో మేనేజర్ శ్రీకాంత్ చార్జి మెమో ఇచ్చాడు. చార్జి మెమో ఎత్తేయడానికి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రూ.10 వేలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుల కోసం డిమాండ్ చేయగా విసుగు చెంది డ్రైవర్ రవీందర్ ఏసీబీని ఆశ్రయించాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా హుజురాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ ని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ రవీందర్ హుజురాబాద్ డిపోలో విధులు నిర్వహిస్తుండగా ఛార్జ్ మెమో తొలగించడం కోసం మేనేజర్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఎల్కతుర్తికి వస్తే ఇస్తానని తెలుపగా ఓ హోటల్లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….