బాహు బలంన్యూస్,హుజురాబాద్, ఆగస్టు 04:
హుజురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు మండల ప్రత్యేకాధికారి (ఆర్డీవో) అధ్యక్షతన ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తూర్పాటి సునీత తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనం, వి.బి. రాంజీ, జలసిరి, వనమహోత్సవం, విద్య, వైద్యారోగ్య, పశుసంవర్ధక, విద్యుత్, స్త్రీ-శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ, నీటిపారుదల, ఐకేపీ (SERP), రహదారులు & భవనాల శాఖ (R&B), గ్రామీణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ-నిత్యావసర వస్తువుల పంపిణీ, ఎక్సైజ్, అటవీ, ఆర్టీసీ, సాంఘిక సంక్షేమం తదితర 20కి పైగా శాఖల ప్రగతిపై సమగ్రంగా సమీక్షించనున్నారు.
సమావేశానికి మండలంలోని గౌరవ సర్పంచులు, మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అలాగే, సంబంధిత మండల స్థాయి అధికారులు తమ శాఖల అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను (40 ప్రతులు – A4 సైజులో) ఆగస్టు 5వ తేదీలోగా ఎంపీపీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.










