బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 03 : మండలంలోని జూపాక గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని, వెంటనే నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ (DSP) మండల అధ్యక్షుడు మంద రాజు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత డాక్టర్ విశారధన్ మహారాజ్ ఆదేశాల మేరకు సోమవారం నాయకులు పంచాయతీ భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంద రాజు మాట్లాడుతూ… గ్రామసభలు, అధికారిక సమావేశాలు నిర్వహించే ఈ భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సునీతను కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యుడు ఇల్లందుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6










