బాహు బలంన్యూస్ హుస్నాబాద్, జూన్ 12 :
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల గ్రామానికి చెందిన ప్రముఖులు శుక్రవారం హుస్నాబాద్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గొడిశాల గ్రామ మాజీ సర్పంచ్ పోగు రమేష్, మానవ హక్కుల కమిషన్ (HRC) మహిళా హక్కుల విభాగం ప్రతినిధి ములుగు రమేష్ లు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గొడిశాల గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారు మంత్రి తో చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో రవాణా సౌకర్యాల మెరుగుదల, బీసీ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, మరియు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల హక్కుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూ.. గొడిశాల గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.











